Skip to main content

Tenth Students : విద్యార్థులకు అర్థమైయ్యేలా బోధించాలి..

Perfect education and teachings should be given to students

సాక్షి ఎడ్యుకేష‌న్: పదో తరగతి విద్యార్థులు త‌మ ఫైనల్ ఎగ్జామ్స్​లలో అత్యధిక మార్కులు సాధించేందుకు వారి ఉపాధ్యాయులు​ కృషి చేయాలని, విద్యార్థుల‌ను ప్రోత్సాహించాలి అని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్​ జితేశ్ వి పాటిల్​ సూచించారు. శుక్ర‌వారం నాడు ఇంగ్లీష్​ లాంగ్వేజ్​ టీచర్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో రూపొందించిన ఆంగ్ల ఐపాస్-2025 బుక్స్ ఆవిష్క‌ర‌ణ‌కు కలెక్టర్​ ఎల్టా ప్రతినిధులతో కలిసి హాజ‌రైయ్యారు. వారే ఐపాస్‌-2025ను ఆవిష్క‌రించారు.

Orphanage School Recruitments : బాలుర‌, బాలిక‌ల ఆశ్ర‌మ పాఠ‌శాల‌ల్లో ఖాళీ పోస్టులు.. ఈ తేదీలోగానే ద‌రఖాస్తులు..

ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల‌తో ప్రోత్సాహికంగా మాట్లాడారు.. విద్యార్థులు​కు ఇంగ్లీష్‌పైనే కాదు, ఎటువంటి విద్య పొంద‌డానికైనా, ఏ స‌బ్జెక్ట్‌కూ భ‌యం క‌ల‌గ‌కుండా ఇష్టంగా నేర్చుకునేలా వారి ఉపాధ్యాయ‌లు​ సులువుగా అర్థమయ్యేలా బోధించాల‌ని సూచించారు. ప‌రీక్ష స‌మ‌యంలో ప్ర‌తీ ఒక్క‌రూ నిర్భ‌యంగానే ఉండి పూర్తి చేయాల‌న్నారు. ఈ ప్రోగ్రాంలో డీఈవో ఎం. వెంకటేశ్వరాచారి, ఎల్టా ప్రతినిధులు దస్తగిరి, షేక్​ జహంగీర్, మేరెడ్డి ఇంద్రసేనారెడ్డి, రాజశేఖర్​, శ్రీనివాస్​ పాల్గొన్నారు. కాగా ఈ నెల 21న కొత్తగూడెంలోని ఆనంద్​ఖని జడ్పీహెచ్​ఎస్​ లో జిల్లా స్థాయి ఆంగ్ల ఒలంపియాడ్​ పోటీలు నిర్వహించనున్నట్టు ఎల్టా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్​దస్తగిరి, షేక్​ మీరా హుస్సేన్​ తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 20 Jan 2025 08:41AM

Photo Stories