Skip to main content

Schools and Colleges: పాఠశాలలు ఆధునిక దేవాలయాలు

Mahatma Jyotiba Phule Schools and Colleges

ధర్మసాగర్‌: మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలు, కళాశాలలు ఆధునిక దేవాలయాలుగా విరాజిల్లుతున్నాయని బీసీ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. మండలంలోని కరుణాపురం శివారులో ఉన్న ఎంజేపీ బాలికల పాఠశాలల స్పోర్ట్స్‌ మీట్‌లో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. యువతకు బాసటగా ఎంజేపీ పాఠశాలలు క్రీడలు, శరీర దారుఢ్యం, ఏకాగ్రతకు దోహదం చేస్తాయన్నారు. ర్యాంకులు సాధించడంలో మేటిగా నిలుస్తున్న ఎంజేపీ పాఠశాల విద్యార్థినులు క్రీడల్లో రాణించడం అభినందనీయమన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కాగా.. మూడ్రోజులుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధి బాలికల పాఠశాలలు, కళాశాలలు స్పోర్ట్స్‌ మీట్‌ నేటితో ముగిసింది. ఈ క్రీడోత్సవాల్లో 18 పాఠశాలలు, 6 జూనియర్‌ కళాశాలలకు చెందిన 870 మంది బాలికలు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్‌ బ్రహ్మం సమన్వయకర్తగా వ్యవహరించారు.
బీసీ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం

చ‌ద‌వండి: Job Mela: రేపు జాబ్‌మేళా

Published date : 05 Oct 2023 05:02PM

Photo Stories