సాక్షి, హైదరాబాద్ : గ్రూప్–2 పరీక్షను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఫిబ్రవరి 28న వెల్లడించింది.
గ్రూప్–2 పరీక్ష తేదీలు ఇవే..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను పరీక్షకు ఒక వారం ముందు www.tspsc.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. 783 గ్రూప్–2 పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.