సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.రోహిణి జూన్ 6న ఆదేశాలు జారీ చేశారు.
జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో రాయితీ
2023–24 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ స్కూళ్లల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని సూచించారు. డీఈఓ ఆదేశాలు జారీ చేయడం పట్ల హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే –టీడబ్ల్యూజేఎఫ్) అధ్యక్ష, కార్యదర్శులు బి.అరుణ్ కుమార్, జగదీష్ , వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, ట్రెజరర్ రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు.