గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు గడువు తేదీ ఇదే..
Sakshi Education
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో సీట్లు పొందిన విద్యార్థులు జూలై 25వ తేదీ వరకు రిపోర్టు చేయవచ్చని సొసైటీ కార్యదర్శి రొనాల్డ్రాస్ జూలై 21న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల వినతి మేరకు రిపోర్టింగ్ తేదీని జూలై 25 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. నిర్దేశించిన గడువు తేదీలోగా రిపోర్టు చేయకుంటే వారికి కేటాయించిన సీట్లు రద్దవుతాయని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్సైట్ను చూడాలని సూచించారు.
చదవండి:
Published date : 22 Jul 2022 04:57PM