AP Contract Employees Regularisation : ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై 10,177 మంది కాంట్రాక్టు ఉద్యోగులను..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు మరో గుడ్న్యూస్ చెప్పింది. AP ప్రభుత్వంలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న 10,177 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ అక్టోబర్ 20వ తేదీన (శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేసింది.
AP Contract Employees Regularisation 2023
అలాగే గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గెజిట్ను గవర్నర్ జారీ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల చిరకాల వాంఛను సీఎం జగన్ నెరవేర్చారు. వివిధ శాఖల్లో సుమారు 10,117 మంది ఫుల్టైం కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్ అయ్యారు.
వీలైనంత ఎక్కువ మందికి మేలు చేసేలా 2–6–2014కు ముందు ఐదేళ్లు సర్వీసు ఉండాలనే నిబంధనలను సీఎం జగన్ సడలించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ చేస్తున్నందుకు సీఎంకు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.