Skip to main content

నిట్, రూర్కెలాలో ఎంబీఏ.. దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్‌ మే 3..

రూర్కెలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. 2021–23 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 75
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: కనీస విద్యార్హతలు కలిగి ఉన్న అభ్యర్థుల్ని గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వూ్యకి ఎంపిక చేస్తారు. వివిధ విభాగాల్లో మార్కుల వెయిటేజి ఉంటుంది. కెరీర్‌ మార్కులు–30,నేషనల్‌ లెవల్‌ టెస్ట్‌ స్కోర్‌(క్యాట్‌/గ్జాట్‌/సీమ్యాట్‌/మ్యాట్‌)–20, గ్రూప్‌ డిస్కషన్‌ స్కోర్‌–20, పర్సనల్‌ ఇంటర్వూ్య స్కోర్‌–20,పని అనుభవం–10 మార్కుల వెయిటేజీ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును హెచ్‌ఓడీ, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, రూర్కెలా, ఒడిశా, పిన్‌–769008 చిరునామాకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.05.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.nitrkl.ac.in

Photo Stories