Skip to main content

Campus Interviews: ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ఉద్యోగాలు

Jobs for Triple IT Students

వేంపల్లె : క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు రూ.5.50 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు వచ్చినట్లు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ కె.సంధ్యారాణి తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌లో మాపెల్‌ ల్యాబ్స్‌ సంస్థ నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించింది. సీఎస్‌ఈ బ్రాంచ్‌కు చెందిన విద్యార్థులు జరిపిటి చందు, మద్దినేని అనిల్‌కుమార్‌, ఉప్పరకోట ఆంజనేయులు, ఎం.జగన్‌మోహన్‌రెడ్డి, చాకలి అనిల్‌కుమార్‌, పి.మోహన్‌రాజు, జి.రవిచంద్ర, పి.మౌనికలు ఎంపికయ్యారు. తమ ట్రిపుల్‌ ఐటీ నుంచి 8 మంది విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ఆర్జీయూకేటీ చాన్స్‌లర్‌ కె.చెంచురెడ్డి, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌, డైరెక్టర్‌ కె.సంధ్యారాణి, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేసి, వారిని అభినందించారు.

చ‌ద‌వండిRGUKT Basara: ‘బాసర’ విద్యార్థుల కోసం ఏఐ యాప్‌

Published date : 12 Aug 2023 05:32PM

Photo Stories