Skip to main content

IIIT: మూడో విడత కౌన్సెలింగ్‌ తేదీ ఇదే..

నూజివీడు: ఏపీలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో మిగిలిన సీట్ల భర్తీకి నవంబర్‌ 14న మూడో విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు చాన్స్‌లర్‌ ఆచార్య కేసీరెడ్డి నవంబర్‌ 2న తెలిపారు.
IIIT
ట్రిపుల్ ఐటీ మూడో విడత కౌన్సెలింగ్‌ తేదీ ఇదే..

ఎంపికైన అభ్యర్థుల జాబితాతో పాటు ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల జాబితాను 9న వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. గత రెండు విడతల్లో ఎంపికై చేరకుండా ఉన్న అభ్యర్థులకు ఆసక్తి ఉంటే మూడో విడత కౌన్సెలింగ్‌లో హాజరవ్వచ్చని, దీనికి గాను వర్సిటీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు.

చదవండి: IIIT: 30 మంది ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ఉద్యోగాలు

ఎవరైనా ప్రస్తుతం చేరిన ట్రిపుల్‌ ఐటీ నుంచి మరో ట్రిపుల్‌ ఐటీకి మారాలనుకునే వారు వర్సిటీ వెబ్‌సైట్‌లో ఇచ్చిన లింకులో నమోదు చేసుకోవాలన్నారు. మరొక ట్రిపుల్‌ ఐటీకి మార్చిన తరువాత తప్పనిసరిగా అక్కడకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్‌లను నవంబర్‌ 6న సాయంత్రం 5 గంటల్లోపు పూర్తి చేసుకోవాలని కోరారు.

చదవండి: IIIT Hyderabad: వైఫై బదులు వై–సన్‌..

Published date : 03 Nov 2022 03:45PM

Photo Stories