Skip to main content

National Games 2025: తైక్వాండోలో హర్షప్రదకు రజతం.. వరుణ్‌కు కాంస్యం

38వ జాతీయ క్రీడల్లో ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ తెలంగాణ ఖాతాలో ఒక పతకం... ఆంధ్రప్రదేశ్‌ ఖాతాలో ఒక పతకం చేరాయి.
Telangana Harshapradha Won Silver In National Games 2025

మహిళల తైక్వాండో (క్యోరుగీ) అండర్‌–73 కేటగిరీలో తెలంగాణకు చెందిన పాయం హర్షప్రద రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో హర్షప్రద 0–2 తేడాతో ఇతిషా దాస్‌ (చండీగఢ్‌) చేతిలో పరాజయం పాలైంది.

ప్రస్తుతం తెలంగాణ ఆరు పతకాలతో (1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్యాలు) 28వ స్థానంలో ఉంది. మరోవైపు పురుషుల తైక్వాండో అండర్‌–68 కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి.వరుణ్‌ కాంస్య పతకం గెలిచాడు. 

సెమీఫైనల్లో వరుణ్‌ 0–2తో మహేంద్ర పరిహార్‌ (ఉత్తరాఖండ్‌) చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ 10 పతకాలతో (4 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు) 18వ స్థానంలో ఉంది.  

Karnataka Swimmers: జాతీయ క్రీడల్లో కర్ణాటక స్విమ్మర్లకు.. చెరో తొమ్మిది పసిడి పతకాలు

Published date : 10 Feb 2025 09:20AM

Photo Stories