Skip to main content

Womens Kabaddi Team: భారత మహిళల కబడ్డీ జట్టుకు రూ.67.50 లక్షల నగదు బహుమతి

Indian women's kabaddi team wins Asian Kabaddi Championship 2025   Sports Ministry Announces Rs 67.50 Lakh Cash Award For Indian Womens Kabaddi Team After Asian Championship Triumph

ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఐదోసారి విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రూ.67.50 లక్షల నగదు బహుమతి అందించింది.

ఇటీవల ఇరాన్‌ వేదికగా జరిగిన టోర్నీలో అజేయంగా నిలిచిన భారత మహిళల కబడ్డీ జట్టు.. ఫైనల్లో 32–25 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఇరాన్‌ జట్టును ఓడించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఐదో సారి ఈ టోర్నీలో విజేతగా నిలిచింది.

మార్చి 11వ తేదీ స్వదేశానికి తిరిగి వచ్చిన భారత మహిళల కబడ్డీ జట్టును కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ అభినందించారు. 

ICC Champions Trophy: ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేతగా భార‌త్.. న్యూజిలాండ్‌పై ఘన విజయం.. ప్రైజ్‌ మనీ ఎంతంటే..?

Published date : 13 Mar 2025 01:40PM

Photo Stories