Skip to main content

Karnataka Swimmers: స్విమ్మర్లు ధినిధి, శ్రీహరి నటరాజ్‌లకు చెరో తొమ్మిది పసిడి పతకాలు

జాతీయ క్రీడల్లో కర్ణాటక స్విమ్మర్లు ధినిధి డెసింగు, శ్రీహరి నటరాజ్‌ పతకాల పంట పండించారు.
Karnataka Swimmers win 9 Gold Medals Each in The National Games Swimming Event

ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల స్విమ్మింగ్‌ ఈవెంట్‌లో ఈ ఇద్దరూ చెరో 9 పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు. 

పారిస్‌ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ధినిధి డెసింగు 14 ఏళ్ల వయస్సులో పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన తరువాత జాతీయ క్రీడల్లో 9 పసిడి పతకాలు సాధించి, 11 పతకాలు సొంతం చేసుకున్నారు. ఆమె సాధించిన పతకాల జాబితాలో మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో జాతీయ రికార్డు తిరగరాయడం, 400 మీటర్ల ఫ్రీస్టయిల్, 200 మీటర్ల ఫ్రీస్టయిల్, 100 మీటర్ల బటర్‌ఫ్లయ్, 50 మీటర్ల ఫ్రీస్టయిల్, అలాగే వివిధ రకమైన రిలే ఈవెంట్లలో పసిడి పతకాలు పొందడం ఉన్నాయి.

శ్రీహరి నటరాజ్.. పురుషుల విభాగంలో 9 స్వర్ణాలు, 1 రజతంతో మొత్తం 10 పతకాలు సాధించాడు.

ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ జాతీయ క్రీడల్లో స్విమ్మింగ్‌ పోటీలు ముగిశాయి. ఈ విజయాలతో కర్ణాటక మొత్తం 37 పతకాలతో (22 స్వర్ణాలు, 10 రజతాలు, 5 కాంస్యాలు) మొత్తం పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

National Games: జాతీయ క్రీడల్లో తెలంగాణకు తొలి స్వర్ణం
Published date : 05 Feb 2025 01:08PM

Photo Stories