Skip to main content

Aero India 2025: ‘ఏరో ఇండియా’లో.. అమెరికా, రష్యా యుద్ధ విమానాల ప్రదర్శన

బెంగళూరులో జరుగుతున్న 15వ వైమానిక ప్రదర్శన (ఏరో ఇండియా)లో రెండు అగ్రదేశాల యుద్ధ విమానాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Aero India 2025

రష్యా, అమెరికా దేశాలు ఒకే వేదికపై తమ అత్యాధునిక యుద్ధ విమానాలను ప్రదర్శించడం ఇదే మొదటిసారి.

భారతదేశం ఈ రెండు దేశాల మధ్య సమన్వయాన్ని సమర్థంగా నిర్వహించి, రష్యా, అమెరికా యొక్క అత్యాధునిక సాంకేతికతలను ఒకే వేదికపై ప్రదర్శించడంలో కీలకపాత్ర పోషించింది.

రష్యా నుంచి ఎస్‌యూ-57, 5వ తరం యుద్ధ విమానం భారత గగనతలంలో తొలిసారిగా ప్రదర్శించబడింది. ఈ విమానం సూపర్‌సోనిక్ క్రూయిజింగ్ స్పీడ్, ఆన్‌బోర్డ్ ఎలక్ట్రానిక్స్, రాడార్ వ్యవస్థలతో అత్యంత శక్తివంతమైన సాంకేతికతను అందిస్తుంది. రష్యా ఈ విమానం యొక్క సాంకేతికతను భారతదేశంకి అందించేందుకు ఒప్పందం చేసుకుంది.

Cryogenic Engine: శూన్య స్థితిలో క్రయోజనిక్‌ ఇంజన్‌ పరీక్ష సక్సెస్

భారత్, అమెరికా మధ్య 4 బిలియన్ డాలర్ల విలువైన కీలక ఒప్పందాలు ఏరో ఇండియా వేదికపై జరిగాయి. ఈ ఒప్పందాల్లో వైమానిక, జలాంతర్గామి, డ్రోన్, సైబర్ భద్రత రంగాల్లో భాగస్వామ్యం ఉంది. హెచ్‌ఏఎల్ సంస్థ జీఈ ఎరోస్పేస్తో ఎఫ్‌ 414 ఇంజిన్ల తయారీకి ఒప్పందం చేసింది. ఇది ఎల్‌సీఏ-ఎంకే2 విమానాలకు అవసరమైన ఇంజిన్లను తయారు చేస్తుంది.

అమెరికా నుంచి ఎఫ్-16, కేసీ-135 ట్యాంకర్, బీ-1 బాంబర్ వంటి అత్యాధునిక సాంకేతికతను భారత్‌తో పంచుకునేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్ర‌వ‌రి 10 నుంచి 14వ తేదీ వరకు బెంగళూరు సమీప యలహంకలో ‘ఏరో ఇండియా’ జ‌రుగుతుంది.

Published date : 14 Feb 2025 10:21AM

Photo Stories