Sri Lankaలో మరోసారి ఎమర్జెన్సీ
శ్రీలంకలో మరోసారి దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధిస్తూ తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె (73) జూలై 18న నిర్ణయం తీసుకున్నారు. పాలక శ్రీలంక పీపుల్స్ పార్టీ (ఎస్ఎల్పీపీ)కి ఆయన తొత్తుగా మారారంటూ జనాల్లో ఆగ్రహావేశాలు రాజుకుంటున్నాయి. తాజా మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స మాదిరిగానే రణిల్ కూడా తప్పుకోవాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు నానాటికీ ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రణిల్ ఈ చర్యకు దిగారు. దాంతో 20న కొత్త అధ్యక్షుని ఎన్నిక జరిగే వేళ రణిల్కు విశేషాధికారాలు దఖలు పడ్డాయి. ఇది అప్రజాస్వామికమైన క్రూర చర్య అంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. ‘‘గొటబయకు, రణిల్కు తేడా లేదు. ఆయన రణిల్ ‘రాజపక్స’ విక్రమసింఘె మాదిరిగా వ్యవహరిస్తున్నారు’’ అంటూ మండిపడ్డాయి. బార్ అసోసియేషన్ కూడా ఎమర్జెన్సీని తీవ్రంగా తప్పుబట్టింది. తక్షణం ఎత్తేయాలని డిమాండ్ చేసింది. అధ్యక్ష రేసులో రణిల్ కూడా ఉన్న విషయం తెలిసిందే. పాలక ఎస్ఎల్పీపీ కూడా ఆయనకు మద్దతు ప్రకటించడం జనాల్లో ఆయన పట్ల వ్యతిరేకతను మరింతగా పెంచుతోంది. ఈ నేపథ్యంలో వారి ఆగ్రహావేశాలను తగ్గించే దిశగా పలు చర్యలకు రణిల్ తెర తీశారు. ‘‘21వ తేదీ నుంచి పౌరులకు పెట్రోల్ పంపిణీ పునఃప్రారంభమవుతుంది. పెట్రో ఉత్పత్తుల ధరలు కూడా తగ్గిస్తున్నాం. రెండుకరాల కంటే తక్కువున్న రైతుల రుణాలను రద్దు చేస్తున్నాం’’ అని చెప్పారు.
Also read: UBS CEOగా భారత–అమెరికన్ నౌరీన్(Naureen Hassan)
సింగపూర్లోనూ ‘గో గొటా గో’...
మాల్దీవుల నుంచి సింగపూర్ వెళ్లిన గొటబయకు అక్కడా నిరసనల సెగ తప్పడం లేదు. సింగపూర్ పౌరులు గొటబయకు వ్యతిరేకంగా మౌన ప్రదర్శనలు చేశారు. ఆయనకు సింగపూర్ ఆశ్రయమివ్వడం పట్ల శ్రీలంక పౌరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ ప్రభుత్వ ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ నిరసనలు తెలిపారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 18th కరెంట్ అఫైర్స్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP