Skip to main content

Bharat Rice: మార్కెట్‌లోకి ‘భారత్‌ రైస్‌’

Bharat Rice

కేంద్ర ప్రభుత్వం బియ్యం ధరల తగ్గింపునకు శ్రీకారం చుట్టి, సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది. మంగళవారం (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు భారత్‌ రైస్‌ను ప్రభుత్వం మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ బియ్యాన్ని కిలో రూ.29కి విక్రయిస్తున్నారు. బియ్యం ధరల తగ్గింపునకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. దేశీయ మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలలో గణనీయమైన తగ్గింపు లేదు. నిత్యావసరాల ధరలు ప్రస్తుతం 14.5 శాతం మేరకు పెరిగాయి. భారత్‌ రైస్‌ ఫిబ్రవరి 6 నుంచి ఎన్‌ ఏఎఫ్‌ఈడీ, ఎన్‌ సీసీఎఫ్, కేంద్రీయ భండార్‌తో సహా అన్ని చైన్‌∙రిటైల్‌లలో అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Published date : 16 Feb 2024 03:27PM

Photo Stories