Skip to main content

Finance Commission Grants: ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల.. ఎన్ని రూ.కోట్లు అంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం రూ.988.773 కోట్ల నిధులను విడుదల చేసింది.
Central Government releases Rs.988.773 crores to rural local bodies in Andhra Pradesh  Centre Releases First Installment of Fifteenth Finance Commission Grants to Rural Local Bodies in Andhra Pradesh, Rajasthan

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ఈ నిధులను అందించింది.  

2024-25 ఆర్థిక సంవత్సరానికి అన్‌టైడ్‌ గ్రాంట్లు రూ.395.51 కోట్లు, టైడ్‌ గ్రాంట్లు రూ.593.26 కోట్లు విడుదల చేయడం జరిగింది.

ఈ నిధులు రాష్ట్రంలో అర్హత గల తొమ్మిది జిల్లా పంచాయతీలు, 615 బ్లాక్‌ పంచాయతీలు, 12,853 గ్రామ పంచాయతీలకు అందుతాయి. అన్‌టైడ్‌ గ్రాంట్లు వ్యవసాయం, విద్య, పారిశుధ్యం వంటి 29 స్థానిక అవసరాల కోసం ఉపయోగించబడతాయి. కానీ ఈ నిధులను జీతాలు లేదా ఇతర స్థిర ఖర్చులకు ఉపయోగించకూడదని సూచన ఇచ్చారు.

టైడ్‌ గ్రాంట్లు పారిశుధ్యం, వర్షపు నీటి సంరక్షణ, గృహ వ్యర్థాల శుద్ధి వంటి ప్రధాన అంశాలపై ఖర్చు చేయాలన్నది కేంద్రం నిర్ధారించింది.

Central Government: 28 రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల.. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని రూ.కోట్లు అంటే..!

అలాగే.. ఇటువంటి నిధులను రాజస్థాన్‌ రాష్ట్రానికి కూడా విడుదల చేశారు. అక్కడ రూ.1,267 కోట్లు అందించబడ్డాయి. 

Published date : 14 Oct 2024 01:07PM

Photo Stories