Skip to main content

ASEAN-India Summit: 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు

లావోస్‌ వేదికగా 21వ ‘ఆసియాన్- ఇండియా సమ్మిట్‌’ అక్టోబ‌ర్ 10వ తేదీ జ‌రిగింది.
Leaders at the 21st ASEAN-India Summit discussing key issues  Prime Minister Narendra Modi speaking at the 21st ASEAN-India Summit in Laos  ASEAN-India Friendship Important During Global Conflicts, Tensions in World, Says PM Modi

ఈ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని మాట్లాడారు. 21వ శతాబ్దం భారతదేశం, ఆసియాన్ దేశాల శతాబ్దంగా మోదీ అభివర్ణించారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు ఘర్షణలు, ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న సమయంలో భారత్-ఆసియాన్ స్నేహం ముఖ్యమైనదని ఆయన అన్నారు. 2025వ ఏడాదిని ఆసియాన్-భారత పర్యాటక సంవత్సరంగా ప్రకటించారు.

"10 సంవత్సరాల క్రితం యాక్ట్ ఈస్ట్ పాలసీని ప్రకటించాం. గత దశాబ్దంలో ఇది భారతదేశం, ఆసియాన్ దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలకు కొత్త శక్తిని, దిశను, వేగాన్ని ఇచ్చింది. మనం శాంతి, ప్రేమిగల దేశాలం. ఒకరి జాతీయ సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. ఈ ప్రాంత యువత ఉజ్వల భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నాం" అని మోదీ పేర్కొన్నారు.

RuPay Card: మాల్దీవుల్లో రూపే కార్డు సేవల ప్రారంభం.. మోదీతో ముయిజ్జు ద్వైపాక్షిక భేటీ

2019లో ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, "గతేడాది ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసం సముద్ర కార్యక్రమాలు ప్రారంభించాం. ఆసియాన్ దేశాలతో భారతదేశ వాణిజ్యం దాదాపు రెండింతలు పెరిగి 130 బిలియన్ డాలర్లను మించినది. 10 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తున్నాం. నలంద విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్‌లు రెట్టింపు చేస్తాం. భారత్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఆసియాన్ విద్యార్థులకు కొత్త గ్రాంట్లు ఇస్తాం" అని ఆయన తెలిపారు.

Published date : 11 Oct 2024 02:53PM

Photo Stories