Skip to main content

AP Government: ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారుగా నియ‌మితులైన న‌లుగురు వీరే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు ప్రముఖ వ్యక్తులను గౌరవ సలహాదారులుగా నియమించింది.
AP Government Appoints Four Distinguished Experts as Honorary Advisors

కేబినెట్ ర్యాంకు వంతుగా రెండు సంవత్సరాల పాటు వీరు  పదవిలో కొనసాగనున్నారు. 

1. సుచిత్ర ఎల్లా: భారత బయోటెక్ ఎండీ, చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా నియమితులయ్యారు. ఆమె ప్రభుత్వానికి ఈ రంగంలో సలహాలు, సూచనలు అందించనున్నారు.

2. జి.సతీష్ రెడ్డి: డీఆర్‌డీఓ(DRDO) మాజీ చీఫ్, ఆయన్ని ఏరో స్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సలహాదారుగా నియమించారు. పరిశ్రమలు, సైబర్ సెక్యూరిటీ, ఏఐ(AI), రోబోటిక్స్ తదితర రంగాలలో ప్రభుత్వానికి సూచనలు అందించనున్నారు.

3. కేపీసీ గాంధీ: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా నియమితులయ్యారు. ఆయన రెండు సంవత్సరాలు ప్రభుత్వానికి ఫోరెన్సిక్ సైన్స్ సంబంధిత అంశాలపై సలహాలు అందించనున్నారు.

4. శ్రీధర పనిక్కర్ సోమనాథ్: స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీ, పరిశోధన, పాలనా వ్యవహారాలలో ప్రభుత్వానికి సూచనలు అందించనున్నారు.

Indian Origins: కెనడా కేబినెట్‌లో ఇద్దరు భారత మహిళలు

Published date : 20 Mar 2025 03:32PM

Photo Stories