Skip to main content

Job Mela 2023 : పాలిటెక్నిక్‌ విద్యార్థులకు జాబ్‌మేళా.. ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేషన్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని పాలిటెక్నిక్‌ విద్యార్థుల కోసం ఫిబ్రవరి 25, 26 తేదీల్లో విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్‌ సెంటర్‌లో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపా­రు.
Job Mela
Job Mela 2023

రైలు రవాణా సేవలను అందిస్తున్న మేధా సర్వో డ్రైవ్స్‌ సంస్థలో రూ.3 లక్షల వార్షిక వేతనంతో వంద మందిని ఇంజనీరింగ్‌ ట్రైనీలుగా తీసుకునేందుకు ఈ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు వివరించారు. 

అర్హతలు ఇవే..

job mela 2023 telugu news

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ బ్రాంచ్‌లలో 2022 సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా వాక్‌ ఇన్‌ ఇంటర్వూ్యలకు హాజరుకావొచ్చని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 9346207421, 6309953362 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు డిప్లొమా విద్యార్థులకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించేలా సాంకేతిక విద్యాశాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే గత డిసెంబరులో రూ.3 లక్షల ప్యాకేజీతో మేధా సర్వో డ్రైవ్స్‌ 31 మందికి పారిశ్రామిక శిక్షణతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించిందని నాగరాణి పేర్కొన్నారు.

Published date : 24 Feb 2023 05:07PM

Photo Stories