Skip to main content

Job Fair: నిరుద్యోగ యువత‌కు జాబ్‌ ఫెయిర్‌లో 108 మందికి ఉద్యోగాలు

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): మాచవరం ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మార్చి 4న‌ జవహర్‌ నాలెడ్జి సెంటర్‌(జేకేసీ) ఆధ్వర్యాన నిర్వహించిన జాబ్‌ ఫెయిర్‌లో 108 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
Jobs for 108 people in job fair

 కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్‌ ఫెయిర్‌ను కళాశాల ప్రిన్సిసాల్‌ డాక్టర్‌ కె. భాగ్యలక్ష్మి ప్రారంభించారు. విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నిర్ధేశించుకున్న లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుకుంటుండగానే ఉపాధి కల్పించేందుకు జేకేసీ కృషి చేస్తుందని.. ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చదవండి: APSET 2024 Notification: ఏపీ సెట్‌ 2024 నోటిఫికేషన్‌.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

అనంతరం ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన తొమ్మిది ప్రభుత్వ కళాశాలలు, మొవ్వ, పామర్రు, అవనిగడ్డ, బంటుమిల్లి, తిరువూరు, మైలవరం, కంచికచర్ల తదితర కళాశాలకు చెందిన మొత్తం 475 మంది విద్యార్థులు జాబ్‌ఫెయిర్‌కు హాజరయ్యారు. ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత 108 మంది విద్యార్థులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సీసీఈ ఓఎస్‌డీ రమేష్‌, మీరావళి, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ ఏ ఆశీర్వాదం జేకేసీ నుంచి డి. సురేష్‌, పలు కళాశాలల ప్రిన్సిపాల్స్‌ పాల్గొన్నారు.

Published date : 05 Mar 2024 04:24PM

Photo Stories