గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జూలై 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి. నరేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
పాలిటెక్నికల్ కళాశాలలో జాబ్ మేళా
జూలై 28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాబ్ మేళాలో 10 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. వారికి కావాల్సిన నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసుకుంటారన్నారు.