Skip to main content

Jobs: అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం

డిచ్‌పల్లి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌, డిచ్‌పల్లి, బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పలు సబ్జెక్టుల్లో బోధించేందుకు అర్హులైన అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి న‌వంబ‌ర్ 5న‌ ఒక ప్రకటనలో కోరారు.
Teaching opportunities in government degree colleges in the district, Jobs, Job opportunity: Teaching positions in various subjects at district's government colleges,

గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్‌ సబ్జెక్టుకు, డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జువాలజీ, తెలుగు, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, ఇంగ్లిష్‌, ఎకనామిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కామర్స్‌, బోటనీ, కెమిస్ట్రీ, బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్‌ సబ్జెక్టు బోధించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: Guest Lecturer Posts: డిగ్రీ క‌ళాశాలల్లో గెస్ట్ లెక్చ‌రర్ పోస్టులు

పీజీలో సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ లకు 50 శాతం) కలిగి ఉన్నవారు అర్హులన్నారు. నెట్‌, సెట్‌, పీహెచ్‌డీ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. బోధనానుభవం కలిగిన అభ్యర్థులు సర్వీస్‌ సర్టిఫికెట్‌ జత చేయాలన్నారు. అర్హులైన అభ్యర్థులకు ఈనెల 8న గిరిరాజ్‌ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి డెమో, ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను గిరిరాజ్‌ కళాశాలలో మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలన్నారు.

Published date : 06 Nov 2023 01:28PM

Photo Stories