Skip to main content

Batthepu Mahesh: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని..

ఆత్మకూరు(ఎం) : ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Batthepu Mahesh
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని..

 ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్‌లో చోటుచేసుకుంది. కొరటికల్‌ గ్రామానికి చెందిన బత్తెపు మహేష్‌(24) రెండేళ్ల క్రితం బీపీడీ కోర్సు పూర్తి చేశాడు. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా పలు పరీక్షలు రాశాడు. అయినప్పటికీ ఎటువంటి ఉద్యోగం రాకపోవడంతో నెల రోజుల నుంచి ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఆగ‌స్టు 20న‌ ఉదయం తల్లిదండ్రులు వ్యవసాయ భావి వద్దకు వెళ్లగా మహేష్‌ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు.

ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన మహేష్‌ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మధ్యాహ్న సమయంలో కుటుంబ సభ్యులు ఇంటికి రాగా మహేష్‌ అప్పటికే మృతిచెందాడు. ఉద్యోగం రావడం లేదంటూ అప్పుడప్పుడు తల్లిదండ్రులతో అంటుండే వాడని గ్రామస్తులు పేర్కొన్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దొమ్మేటి నాగరాజు తెలిపారు.

Published date : 21 Aug 2023 05:23PM

Photo Stories