Skip to main content

ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు సీట్లు

రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించేందుకు సంబంధించిన విద్యా హక్కు చట్టం 12(1)(సి) నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ కె.సురేష్ కుమార్‌ చెప్పారు.
ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు సీట్లు
ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు సీట్లు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించేందుకు సంబంధించిన విద్యా హక్కు చట్టం 12(1)(సి) నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ కె.సురేష్ కుమార్‌ చెప్పారు.

మార్చి 28న ఆయన విద్యా హక్కు చట్టం రాష్ట్ర కమిటీ చైర్మన్ బుడితి రాజశేఖర్, సభ్యులు, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ప్రతినిధులు, ఎన్జీవోలతో సమావేశమయ్యారు. 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున.. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రైవేటు స్కూళ్లలో విద్యా హక్కు చట్టం 12(1)(సి)ని తప్పకుండా అమలు చేసేందుకు ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్‌ ప్రతినిధులు, ఎన్జీవోలు అంగీకరించినట్లు కమిషనర్‌ తెలిపారు. ఒక్కో విద్యారి్థకయ్యే ఖర్చుకు సంబంధించిన నిర్ణయాలపై కమిటీ కూలంకషంగా చర్చలు జరిపిందని మీడియాకు చెప్పారు. సమావేశంలో సమగ్ర శిక్షా రాష్ట్ర సంచాలకులు కె.వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు. 

Published date : 29 Mar 2022 02:52PM

Photo Stories