Skip to main content

Department of Education: ఆన్‌లైన్‌లోనే టీచర్ల బదిలీలు

తాండూరు: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతు లన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
Department of Education
తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

జనవరి 24న తన పుట్టిల్లయిన వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం కోటబాస్పల్లిలో ఎల్లమ్మ దేవత ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పదోన్నతులు, బదిలీల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపణలను సబిత ఖండించారు.

చదవండి: School Education Department: గురువుల సేవలు ఇక పూర్తిగా విద్యకే పరిమితం

ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, అవగాహన రాహిత్యంతోనే ఆ విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. బదిలీలు, పదోన్నతులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతాయన్నారు. ఈసారి కూడా తాను మహేశ్వరం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. 

చదవండి: Tenth Class: ‘పది’పై ప్రత్యేక దృష్టికి విద్యాశాఖ ఆదేశం

Published date : 25 Jan 2023 03:18PM

Photo Stories