Skip to main content

150 మంది గిరిజన విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

సాక్షి, అమరావతి: సమాజంలో పోటీ పడి రాణించాలంటే విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం సాధించాలని ఎన్‌టీఆర్‌ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి(డీటీడబ్ల్యూఓ) ఎం.రుక్మంగదయ్య చెప్పారు.
Skill training for 150 tribal students
150 మంది గిరిజన విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

నవజీవన్‌ బాలభవన్‌ ఆధ్వర్యంలో 150 మంది గిరిజన విద్యార్థులకు ‘నాయకత్వ లక్షణాలు, సాఫ్ట్‌ స్కిల్స్‌’పై డిసెంబర్‌ 4న శిక్షణ ఇచ్చారు. విజయవాడ బావాజీపేట నవజీవన్‌ హాల్లో జరిగిన కార్యక్రమంలో రుక్మంగదయ్య మాట్లాడుతూ నవజీవన్‌ బాలభవన్‌ ద్వారా 150 మంది బడి బయట ఉన్న గిరిజన పిల్లలను తిరిగి పాఠశాల్లో చేర్పించడంతో పాటు వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు.

చదవండి: Department of Tribal Welfare: గిరిజన విద్యా సంస్థల్లో గేటు వరకే అనుమతి

నవజీవన్‌ ప్రోగ్రాం మేనేజర్‌ శీలం జోసఫ్‌ డోనాల్డ్‌ మాట్లాడుతూ గిరిజన పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని నిరంతరం మెరుగుపెట్టాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ జాన్‌ అలెగ్జాండర్‌ విలియమ్స్, కోఆర్డినేటర్స్‌ నజ్మా, పి.ఝాన్సీరాణి, సుజాత పాల్గొని మాట్లాడారు.

చదవండి: Bhaskar Halami: కడు పేదరికం నుంచి ‘అగ్ర’ శాస్త్రవేత్త దాకా...

Published date : 05 Dec 2022 03:24PM

Photo Stories