500 పడకల కొత్త బాలికల హాస్టల్ను ప్రారంభించిన వైస్ ఛాన్సలర్
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో బాలికల కోసం 500 పడకల నూతన శతాబ్ది ఉత్సవ హాస్టల్ను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్ ఫిబ్రవరి23న ప్రారంభించారు.
500 పడకల కొత్త బాలికల హాస్టల్ను ప్రారంభించిన వైస్ ఛాన్సలర్
ఈ హాస్టల్లో రీడింగ్ రూములు, విశాలమైన డైనింగ్ హాల్ అలాగె అత్యాధునిక వంటగది ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సమీపంలో ఉన్న ఈ హాస్టల్ను యూనివర్సిటీ, రూసా నిధులు 37.5 కోట్లుతో నిర్మించారు. బాలికల చేరికలో గణనీయమైన పెరుగుదల ఊన్నందున ఈ హాస్టల్ నిర్మీంచబడింది. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ బి. రెడ్యా నాయక్, సీపీడబ్ల్యూడీ ఎన్ఎన్ ఎస్ఎస్ రావు, యూనివర్సిటీ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.