Skip to main content

RGUKT: ట్రిపుల్‌ ఐటీలకు భారీగా దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..

నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో చేరేందుకు గాను ఆన్‌లైన్‌లో భారీగా దరఖాస్తులు అందుతున్నాయి.
RGUKT
ట్రిపుల్‌ ఐటీలకు భారీగా దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..

ట్రిపుల్‌ ఐటీలలో ఉన్న ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సులో చేరేందుకు గాను జూన్‌ 3వ తేదీన ఆర్జీయూకేటీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆ తర్వాత జూన్‌ 4 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. పదో తరగతి ఈ ఏడాది మార్చిలో రెగ్యులర్‌గా ఉత్తీర్ణులైనవారు ఆన్‌లైన్‌లో యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్‌ ఐటీలకు దరఖాస్తులు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

చదవండి: మరింత ఉన్నతంగా ట్రిపుల్ ఐటీలు: ఆదిమూలపు సురేష్

జూన్‌ 16 సాయంత్రం ఆరు గంటల వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే మొత్తం 27,500 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తేలింది. జూన్‌ 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సంఖ్య 40 వేల వరకు చేరుకోవచ్చని ఆర్జీయూకేటీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సీట్ల విషయానికొస్తే.. నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో కలిపి మొత్తం 4400 సీట్లు ఉండటం గమనార్హం. 

Published date : 17 Jun 2023 05:28PM

Photo Stories