భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) జాతీయస్థాయిలో నిర్వహిస్తోన్న జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ రెండో స్థానంలో నిలిచింది.
ఉద్యాన వర్సిటీకి జాతీయ ర్యాంకు
2020కి గాను ఈ స్థానం లభించగా, 2019లో కూడా ఇదే స్థానంలో ఉద్యాన వర్సిటీ నిలిచింది. ఢిల్లీలో సెప్టెంబర్ 28న జరిగిన వ్యవసాయ వర్సిటీల వీసీల సమావేశంలో ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర చేతుల మీదుగా వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వీసీ జానకిరామ్ అవార్డు అందుకున్నారు.