Skip to main content

AP : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంజనీరింగ్‌ కనీస ఫీజు రూ.42,500

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఫీజుల విష­యంలో హైకోర్టు మధ్యే­మార్గంగా ఓ ప్రతిపాదన చేసింది. కనీస ఫీజుగా రూ.42,500 ప్రతిపాదించింది. ఇంతకన్నా ఎక్కువ ఫీజులున్న కళాశాలల్లో తాము ప్రతిపాదించిన ఫీజుకు అదనంగా 10 శాతం వసూలు చేసుకునేందుకు అనుమతినిస్తామని తెలిపింది.
AP : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంజనీరింగ్‌ కనీస ఫీజు రూ.42,500
AP : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంజనీరింగ్‌ కనీస ఫీజు రూ.42,500

ఈ ప్రతిపాదనపై ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు తమ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2020–23 సంవత్సరాలకు ఫీజుల ఖరారుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇంజనీరింగ్‌ కళా­శాలల యాజమాన్యాల సంఘం 2022లో హై­కోర్టులో పిటిషన్లు వేసింది.

ఇవీ చ‌ద‌వండి: ఫీజుల‌పై క్లారిటీ వ‌చ్చాకే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌...?

ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటేశ్వర్లు మంగళవారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) సిఫా­ర­సులకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు ఖరారు చేయడం వల్ల కళాశాలలు నష్టపోతున్నాయన్నారు. 

Engineering

Top 20 Engineering Colleges 2023 Andhra Pradesh Telangana

సదుపాయాల ఆధారంగానే ఫీజులు: ప్రభుత్వం 
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిసూ ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఫీజును ఖరారు చేయ­లేదని తెలిపారు. ఫీజులు ఖరారు చేసేందుకు అన్ని వివరాలు సమర్పించాలని కళాశాలల యాజమాన్యాలను ఆదేశించామన్నారు. చాలా కళాశాలలు ఇప్పటికీ ఆ వివరాలు సమర్పించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు.

➤☛ AP EAPCET College Predictor (Click Here)

త్వరలో ప్రవేశాలకు వెబ్‌ కౌన్సెలింగ్‌ మొదలు కాబోతుంద­న్నారు. ఆ ప్రక్రియను కొనసాగించుకునేందుకు అనుమతినివ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ప్రస్తుతం ఉన్న ఫీజుకు అదనంగా 10 శాతం ఫీజును వసూలు చేసుకునేందుకు అనుమతినిస్తామన్నారు.

Published date : 03 Aug 2023 11:01AM

Photo Stories