Skip to main content

ఈ మెడల్‌ ప్యూర్‌ గోల్డ్‌

గోల్డ్‌ మెడల్‌. క్రీడాకారుడికి.. విద్యార్థికి.. స్కాలర్‌కు ఓ అచీవ్‌మెంట్‌. ఇది ఆ వ్యక్తి అసాధారణ విజయానికి ప్రతీకగా నిలుస్తూ గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. మరి వాళ్లకిచ్చే గోల్డ్‌ మెడల్‌లో ఉండే బంగారం ఎంత అంటే.. ఇసుమంతే. ఒలింపిక్‌ స్వర్ణంలోనూ వెండి శాతమే ఎక్కువగా ఉంటుందన్నది ఆశ్చర్యపరిచే విషయం. కానీ.. విశాఖలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) టాపర్లకు ఏటా అందించే స్వర్ణ పతకం మాత్రం నూరు శాతం బంగారమే.
టాపర్లకు గోల్డ్‌ మెడల్స్‌ అందిస్తున్న  ఐఐఎంవీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌
టాపర్లకు గోల్డ్‌ మెడల్స్‌ అందిస్తున్న ఐఐఎంవీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌

ఒలింపిక్‌ స్వర్ణం కంటే విలువైనది

ఒలింపిక్‌ స్వర్ణం ప్రపంచ క్రీడాకారులకు బంగారు కల. ఆ పతకం కోసం ఎంతగానో పోటీ పడుతుంటారు. అందులో బంగారం చాలా తక్కువ పరిమాణంలోనే ఉంటుంది. ఒలింపిక్‌ స్వర్ణంలో 92 శాతం వెండి, 6 శాతం రాగితో పాటు 2 శాతం పైపూతగా మాత్రమే బంగారం ఉంటుందట. కానీ.. ఐఐఎం అందిస్తున్న ఈ గోల్డ్‌ మెడల్స్‌ను 22 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తున్నారు. ఒక్కో పతకం 25 గ్రాముల బంగారంతో 92 శాతం ప్యూరిటీతో తయారు చేశారు. ఒక్కో మెడల్‌కు ఏకంగా రూ.1.12 లక్షల వరకూ ఖర్చు చేశారు. మొత్తం 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు.

ఐఐఎం ప్రత్యేకత అదే

విద్యార్థులకు చదువు పట్ల మరింత ఆసక్తి పెంచేందుకు ప్యూర్‌ గోల్డ్‌ మెడల్‌ అందించే విధానాన్ని ఐఐఎంలలో అమలు చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తరహా ప్యూర్‌ గోల్డ్‌ మెడల్స్‌ అందించే విద్యాలయం లేదు. విశాఖ ఐఐఎం మాత్రమే కాదు.. దేశంలోని అన్ని ఐఐఎంలలోనూ ఈ తరహా గోల్డ్‌ మెడల్స్‌ అందిస్తున్నాం. ఇదే ఈ విద్యాసంస్థల ప్రత్యేకత. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఈ సంస్కృతి మొదలైంది.
– ప్రొఫెసర్‌ ఎం చంద్రశేఖర్, డైరెక్టర్, ఐఐఎం విశాఖపట్నం

Published date : 02 Nov 2021 11:32AM

Photo Stories