Admissions: సంస్కృత కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
కంటోన్మెంట్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతున్న బోయిన్పల్లిలోని వేంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో 2023–24 విద్యాసంవత్సరంలో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ భానోతు సురేంద్ర ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రచారం నిర్వహిస్తున్న అధ్యాపక బృందం
ఈ మేరకు కళాశాల అధ్యాపక బృందంతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూళ్లు, కళాశాలల్లో ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఇంటర్ తత్సమాన కోర్సు అయిన పీడీసీలో ప్రవేశాలకు కనీసం పదో తరగతి, మూడేళ్ల బీఏ (ఓఎల్) కోర్సులో ప్రవేశాలకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు.
ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు బోయిన్పల్లి ఓల్డ్ ఎయిర్పోర్టు రోడ్డులోని కళాశాలలో నేరుగా లేదా 9951374024 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.