Skip to main content

Admissions: సంస్కృత కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కంటోన్మెంట్‌: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతున్న బోయిన్‌పల్లిలోని వేంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో 2023–24 విద్యాసంవత్సరంలో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ భానోతు సురేంద్ర ఓ ప్రకటనలో తెలిపారు.
INVITING APPLICATIONS FOR ADMISSIONS IN SANSKRIT COLLEGE
ప్రచారం నిర్వహిస్తున్న అధ్యాపక బృందం

ఈ మేరకు కళాశాల అధ్యాపక బృందంతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూళ్లు, కళాశాలల్లో ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఇంటర్‌ తత్సమాన కోర్సు అయిన పీడీసీలో ప్రవేశాలకు కనీసం పదో తరగతి, మూడేళ్ల బీఏ (ఓఎల్‌) కోర్సులో ప్రవేశాలకు ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు.

చదవండి:  TS Inter Sanskrit Syllabus : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సంస్కృత సిలబస్ ఇదే.. ఇలా రాస్తే..

ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు బోయిన్‌పల్లి ఓల్డ్‌ ఎయిర్‌పోర్టు రోడ్డులోని కళాశాలలో నేరుగా లేదా 9951374024 నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

చదవండి: ఇక ఇంటర్, డిగ్రీలలో ద్వితీయ భాషగా ‘సంస్కృతం’.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్‌..

Published date : 07 Jun 2023 03:41PM

Photo Stories