పాఠశాలలకు గైర్హాజరవుతుండడంతోపాటు కొంతమంది సకాలంలో రావడం లేదు. విధుల్లో కూడా సరిగా వ్యవహరించడం లేదనే ఫిర్యాదులు వచ్చాయి. ఎయిడెడ్ స్కూళ్ల సిబ్బంది అందరికీ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు ఆర్జేడీలకు ఉత్తర్వులిచ్చారు.