Skip to main content

MJPAPBCWREIS: బీసీ గురుకులాల ప్రవేశ పరీక్షతేదీలు తేదీ ఇదే..

నర్సీపట్నం: జిల్లాలో బీసీ గురుకులాలకు సంబంధించి ఏప్రిల్‌ 16న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు నర్సీపట్నం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌, జిల్లా కన్వీనర్‌ ఎన్‌.వెంకటరెడ్డి ఏప్రిల్ 13న‌ తెలిపారు.
MJPAPBCWREIS
బీసీ గురుకులాల ప్రవేశ పరీక్షతేదీలు తేదీ ఇదే..

2023–24 విద్యా సంవత్సరానికిగాను బీసీ సంక్షేమ గురుకుల సంస్థ ఆధ్వర్యంలో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలోని నర్సీపట్నం, అనకాపల్లి, తానాం, చోడవరం కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు https://www.mjpapbcwr.in వెబ్‌సైటులో హాల్‌ టికెట్లు డౌన్లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించామన్నారు.

చదవండి:

57 మంది బీసీ గురుకుల విద్యార్థులకు ఇన్స్పైర్ మానక్ అవార్డులు

MJPAPBCWREIS: మహాత్మా జ్యోతిబాపులే ఆర్‌జేసీ/ఆర్‌డీసీ సెట్‌–2023

Published date : 14 Apr 2023 01:20PM

Photo Stories