ఖమ్మం అర్బన్/ఖమ్మం సహకారనగర్: ఇటీవల ఇస్రో చేపట్టిన చంద్రయాన్–3 ప్రయోగంలో పాలుపంచుకున్న ఖమ్మంకు చెందిన శాస్త్రవేత్త వల్లూరు ఉమామహేశ్వరరావును రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సన్మానించారు.
ఉమామహేశ్వరరావుతో నిర్మల్ హృదయ్ పాఠశాల యాజమాన్యం
ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను సన్మానించిన మంత్రి మాట్లాడుతూ దేశం సత్తాను చాటిన ప్రయోగంలో ఖమ్మం వాసి పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్ కొత్తపల్లి నీరజ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఉమామహేశ్వరరావు చదువుకున్న నిర్మల్ హృదయ్ పాఠశాలలో ఆయనను కరస్పాండెంట్ వంగా సాంబశివారెడ్డి, డైరెక్టర్ సుధాకర్రెడ్డి, హెచ్ఎంలు ఏ.పద్మజ, శ్రావణి తదితరులు సన్మానించారు.