PUC Exams 2024: పీయూసీ పరీక్షలకు సర్వం సిద్ధం.. పరీక్షల తేదీలు ఇవే..
Sakshi Education
తుమకూరు : పీయూసీ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సర్వం సిద్ధమైంది. మార్చి 1నుంచి 22వరకు పరీక్షలు జరగనున్నాయి.
![PUC Exam Schedule Students Preparing for PUC Exams All prepared for PUC exams Students Preparing for PUC Exams 26,235 Students Set to Appear for PUC Exams in Tumkur District](/sites/default/files/images/2024/03/16/jayeebhava-inter-students-1710585554.jpg)
తుమకూరు జిల్లా వ్యాప్తంగా 26,235 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. తుమకురు విభాగంలో 25, మధుగిరి విభాగంలో పది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పీయూ శాఖ జాయింట్ డైరెక్టర్ గంగాధర్ తెలిపారు.
చదవండి: Three Annual Exams: క్లాస్ X, XII తరగతులలో మూడు వార్షిక పరీక్షలు... ఎప్పుడంటే
మైసూరు: మైసూరు జిల్లా వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మైసూరు అదనపు జిల్లా అధికారి పి.శివరాజు తెలిపారు. 31,628 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్రాల్లో మంచినీరు, వెలుతురు తదితర ఏర్పాట్లు కల్పించినట్లు ఆయన తెలిపారు.
Published date : 01 Mar 2024 04:47PM