వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం(ఇగ్నో) 2023 జూలై నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సులకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగించినట్లు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ కె.సుమలత తెలిపారు.
‘ఇగ్నో’ కోర్సులకు దరఖాస్తు గడువు పెంపు
పీజీ రెండో సంవత్సరం, డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు రీ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు గడువును కూడా జూలై 31వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. 0866–2565253 నంబరులో సంప్రదించాలన్నారు.