ఓపెన్ స్కూల్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు తేదీలు ఇవే..
Sakshi Education
సాక్షి, భీమవరం: సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్య ద్వారా నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 18 నుంచి 23 వరకు జరుగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.వెంకటరమణ ఏప్రిల్ 10న ఒక ప్రకటనలో తెలిపారు.
ఓపెన్ స్కూల్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు తేదీలు ఇవే..
రెండు బ్యాచ్లుగా నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు.