UPSC Civil Services Results: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు విడుదల..ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు

సాక్షి, ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 1,016 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు, అనిమేష్‌ ప్రధాన్‌కు రెండో ర్యాంకు, దోనూరి అనన్యరెడ్డికి మూడో ర్యాంకు దక్కింది. ఇక ఈ యూపీఎ‍స్సీ ఫలితాల్లో వరంగల్‌కు చెందిన ఇద్దరు సెలక్ట్‌ అయ్యారు.

గతేడాది మే 28వ తేదీన యూపీఎస్పీ ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగాయి. ప్రిలిమ్స్‌ పరీక్షల అనంతరం మేయిన్స్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 15, 16, 17, 23, 24 తేదీల్లో జరిగాయి. మేయిన్స్‌ పరీక్షల ఫలితాలను డిసెంబర్‌ ఎనిమిదో తేదీన విడుదల చేశారు. అనంతరం జనవరి రెండో తేదీ నుంచి ఏప్రిల్‌ రెండు నుంచి ఏప్రిల్‌ తొమ్మిదో తేదీ వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. నేడు తుది ఫలితాలు వెలువడ్డాయి. 

 

 

#Tags