APPSC Group-1 Mains Exam Cancelled : బిగ్ బ్రేకింగ్.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు కీలక తీర్పు
ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మెయిన్స్ పరీక్షతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
అభ్యర్థు జాబితా కూడా రద్దు..
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, రెండు సార్లు మూల్యాంకనం ఎందుకు చేశారని ప్రశ్నించింది. ఇది చట్టవిరుద్ధమన్న కోర్టు.. మెయిన్స్ను రద్దు చేసింది. అంతేకాకుండా మెయిన్స్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా రద్దుచేసింది. 6 నెలల్లో మెయిన్స్ తిరిగి నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
#Tags