B. Ed and M. Ed Results: వైవీయూ బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

బీఈడీ, ఎంఈడీ మూడో సెమిస్టర్‌ ఫలితాలను వర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షకు హాజురైన, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సంఖ్యను వివరించారు..

వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం బీఈడీ, ఎంఈడీ 3వ సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను వైవీయూ వీసీ చింతా సుధాకర్, రిజిస్టార్‌ వై.పి. వెంకటసుబ్బయ్య, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఎన్‌. ఈశ్వర్‌ రెడ్డితో కలిసి తన ఛాంబర్‌ లో గురువారం విడుదల చేశారు.

Diploma Courses: టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు

ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగిన బీఈడీ 3వ సెమిస్టర్‌ పరీక్షలకు 2,485 విద్యార్థులకు గాను 2,322 మంది హాజరయ్యారని, అందులో 1,964 (84.58 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఎంఈడీ మూడో సెమిస్టర్‌ పరీక్షలకు 64 మంది పరీక్షలు రాయిగా 55 (85.94 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు.   సహాయ పరీక్షల నియంత్రణ అధికారి డా.గంగయ్య, సీడీసీ డీన్‌ ఆచార్య రఘుబాబు  పాల్గొన్నారు.

Gurukul Inter Admissions: గురుకుల కళాశాలలో ఇంటర్‌ ప్రవేశానికి దరఖాస్తులు..

#Tags