High Court of Telangana: తెలంగాణ హైకోర్టులో ముగ్గురు అదనపు జడ్జీలకు శాశ్వత హోదా
Sakshi Education
తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ముగ్గురు అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తి హోదా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 13వ తేదీ నోటిఫికేషన్ జారీ చేసింది.

సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 5న కేంద్ర ప్రభుత్వానికి వీరి హోదా గురించి సిఫారసు చేసింది.
జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్కుమార్, జస్టిస్ కె.సుజనలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలన్న ప్రతిపాదనలకు కొలీజియం ఈ నెల 5వ తేదీనే ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
ఈ ముగ్గురు న్యాయ మూర్తులు 2023, జూలై 31న హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. కాగా, శాశ్వత న్యాయ మూర్తులుగా జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్కుమార్, జస్టిస్ కె.సుజన ఫిబ్రవరి 14న బాధ్యతలు చేపట్టారు.
TG High Court: తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు శాశ్వత న్యాయమూర్తులు వీరే..
Published date : 15 Feb 2025 08:50AM