Degree Exams Fees: డిగ్రీ విద్యార్థుల పరీక్షకు ఫీజు చెల్లించాలి.. ఇదే చివరి తేదీ..!
డిగ్రీలో సప్లిమెంటరీ లేదా ఇంప్రూమెంట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఫీజు చెల్లించడానికి చివరి తేదీని ప్రకటించారు..
సాక్షి ఎడ్యుకేషన్: కేయూ దూరవిద్యా కేంద్రంలో డిగ్రీ 2022–23 వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు పరీక్ష ఫీజులను ఈఏడాది మార్చి 15 వరకు చెల్లించాలని కేయూ దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య రాంచంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
DY Chandrachud: గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి న్యాయ విద్య!!
ఇటీవల ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు ఫెయిల్ అయిన సబ్జెక్టులకు, ఇంప్రూవ్మెంట్ రాసే విద్యార్థులు కూడా తమ ఫీజులను చెల్లించాలని పేర్కొన్నారు. అన్ని పేపర్లకు రూ.600లు, రెండు పే పర్ల వరకు రూ. 500లు చెల్లించాలన్నారు. ఇంప్రూవ్మెంట్ ప్రతీ పేపర్కు రూ.300 అని తెలిపారు.
#Tags