KU: పీజీ సెమిస్టర్‌ పరీక్షలు తేదీలు ఇవే..

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరి ధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబా ద్‌ జిల్లాల్లో పీజీ తదితర కోర్సులకు సంబంధించిన సెకండియర్‌ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు నేడు జ‌నవ‌రి 8 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణా ధికారి డాక్టర్‌ ఎస్‌.జ్యోతి తెలిపారు.

జ‌నవ‌రి 8, 10, 12, 16, 18, 20 తేదీల్లో పీజీ (ఎంఏ, ఎంకామ్‌, ఎమ్మెస్సీ, జర్నలిజం మాస్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌) కోర్సుల పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు.

చదవండి: Girraj Govt College: పీజీ కోర్సులకు అటానమస్‌ హోదా..

ఈ పరీక్షల నిర్వహణకు 49 కేంద్రాలను ఏర్పాటు చేశామ ని, 5,486 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని పేర్కొన్నారు.

#Tags