Girraj Govt College: పీజీ కోర్సులకు అటానమస్ హోదా..
Sakshi Education
నిజామాబాద్ అర్బన్: గిరిరాజ్ కళాశాలలోని పీజీ కోర్సులకు అటానమస్ హోదా లభించిందని, సిలబస్లో మార్పులు, పరీక్షలు నిర్వహించుకునే అవకాశం కళాశాలకే ఉంటుందని కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డి అన్నారు.
![Autonomous status for PG courses Principal Rammohan Reddy announces autonomous status for PG courses at Giriraj College, Nizamabad Urban.](/sites/default/files/images/2024/01/06/04nzt244-250035mr-1704509784.jpg)
కళాశాలలో పీజీ కోర్సు మొదటి సంవత్సర విద్యార్థులకు ఒకరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాంను జనవరి 4న నిర్వహించారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాన్ని పెంచుకొని పోటీ పరీక్షలలో ప్రతిభ కనబరిచేందుకు సన్నద్ధం కావాలన్నారు.
చదవండి: Post Graduation: పీజీ ఇంకా ఈజీ
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అబ్దుల్ రఫీక్, కో–ఆర్డినేటర్ సత్యవరప్రసాద్, భరత్ రాజ్, జాన్, సుకుమార్, ముత్యంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, బాలాజీ, రవిరాజ్, సునీత తదితరులు పాల్గొన్నారు.
Published date : 06 Jan 2024 08:26AM