Skip to main content

Girraj Govt College: పీజీ కోర్సులకు అటానమస్‌ హోదా..

నిజామాబాద్‌ అర్బన్‌: గిరిరాజ్‌ కళాశాలలోని పీజీ కోర్సులకు అటానమస్‌ హోదా లభించిందని, సిలబస్‌లో మార్పులు, పరీక్షలు నిర్వహించుకునే అవకాశం కళాశాలకే ఉంటుందని కళాశాల ప్రిన్సిపాల్‌ రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
Autonomous status for PG courses   Principal Rammohan Reddy announces autonomous status for PG courses at Giriraj College, Nizamabad Urban.

కళాశాలలో పీజీ కోర్సు మొదటి సంవత్సర విద్యార్థులకు ఒకరోజు ఓరియంటేషన్‌ ప్రోగ్రాంను జ‌నవ‌రి 4న‌ నిర్వహించారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాన్ని పెంచుకొని పోటీ పరీక్షలలో ప్రతిభ కనబరిచేందుకు సన్నద్ధం కావాలన్నారు.

చదవండి: Post Graduation: పీజీ ఇంకా ఈజీ

కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ రఫీక్‌, కో–ఆర్డినేటర్‌ సత్యవరప్రసాద్‌, భరత్‌ రాజ్‌, జాన్‌, సుకుమార్‌, ముత్యంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాలాజీ, రవిరాజ్‌, సునీత తదితరులు పాల్గొన్నారు.

Published date : 06 Jan 2024 08:26AM

Photo Stories