నాల్గవ సెమిస్టర్‌ పరీక్ష ఫీజు చివ‌రి తేదీ ఇదే

పార్వతీపురం: ఎలాంటి అపరాధ రుసుం లేకుండా నాల్గవ సెమిస్టర్‌ డీఈఎల్‌ఈడీ (2021–23) బ్యాచ్‌కు చెందిన రెగ్యులర్‌ విద్యార్థులు ఆగ‌స్టు 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని పార్వతీపురం మన్యం జిల్లా డీఈఓ ఎన్‌. ప్రేమ్‌కుమార్‌ ఆగ‌స్టు 22న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
నాల్గవ సెమిస్టర్‌ పరీక్ష ఫీజు చివ‌రి తేదీ ఇదే

నాలుగు సబ్జెక్టులకు రూ.250, మూడు సబ్జెక్టులకు రూ.175, రెండు సబ్జెక్టులకు రూ.150, ఒక సబ్జెక్టుకు రూ.125 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రూ.50 అపరాధ రుసుంతో సెప్టెంబర్‌ 7వరకు చెల్లించవచ్చని, సెప్టెంబర్‌ 19నుంచి 22వరకు పరీక్షలుంటాయని పేర్కొన్నారు.

చదవండి:

Anannya Parekh: ఆమె మాట‌లే స్ఫూర్తి.. ఫైనాన్షియల్‌ లిటరసీతో మ‌హిళ‌ల‌ను మార్చేస్తున్న అనన్య పరేఖ్‌

Students Debarred in Degree Exams: డిగ్రీ పరీక్షల్లో 26 మంది డీబార్‌

#Tags