Degree Results: ఏఎన్‌యూ డిగ్రీ 5వ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

ఒంగోలు: ఏఎన్‌యూ పరిధిలో డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీఏఓఎల్‌, బీకాం విద్యార్థులకు జూలైలో నిర్వహించిన విద్యార్థులకు 5వ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను వర్శిటీ క్యాంపస్‌లో వైస్‌ చాన్స్‌లర్‌ రాజశేఖర్‌ పట్టేటి ఆగ‌స్టు 2న‌ విడుదల చేశారు.
ఏఎన్‌యూ డిగ్రీ 5వ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

మొత్తం 11648 మంది రెగ్యులర్‌ విద్యార్థులు పరీక్షలు రాయగా 9686 మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. ఫలితాలు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఏఎన్‌యూ.ఏసీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

చదవండి: Polytechnic: పరిశ్రమతో పాలిటెక్నిక్‌ విద్య అనుసంధానం

రీవాల్యుయేషన్‌, జవాబు పత్రాల వ్యక్తిగత పరిశీలన, జవాబు పత్రాల నకలు పొందేందుకు ఆగ‌స్టు 16వ తేదీ వరకు గడువుందని చెప్పారు. రీవాల్యుయేషన్‌ దరఖాస్తులను విద్యార్థుల నుంచి స్వీకరించి ఆన్‌లైన్‌లో వర్శిటీకి సమర్పించాలని ప్రిన్సిపాళ్లకు స్పష్టం చేశారు.

#Tags