Skip to main content

Education News: 100 కోట్ల‌తో మూడు పాలిటెక్నిక్ కాలేజీలు... ఎక్క‌డెక్క‌డంటే

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: యువతకు ఉజ్వ‌ల‌ భవిష్యత్ ఇచ్చేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రూ.100 కోట్లతో 3 పాలిటెక్నిక్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ సోమవారం గెజిట్‌ విడుదల చేశారు. ఈ వివరాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు.

విద్యార్థుల‌కు త‌గ్గ‌నున్న భారం...
నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైఎస్సార్‌ జిల్లా మైదుకూరులో పాలిటెక్నిక్‌ కాలే­జీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కాలే­జీలు అందుబా­టులోకి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, మెటలర్జికల్‌ విభాగాల్లో డిప్లొమా కోర్సుల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన అవసరం ఉండదు.  

చ‌ద‌వండి: ఏపీ పీజీఈసెట్ నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది... ప‌రీక్ష ఎప్పుడంటే
రూ.100 కోట్ల‌తో....
కాలేజీల ఏర్పాటు ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ మెరుగుపడ‌డంతో పాటు చ‌దువు పూర్తవ­గానే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని బుగ్గ‌న‌ తెలిపారు. సుమారు ఒక్కో కాలేజీకి రూ.30 కోట్ల ఖ‌ర్చు చేయ‌నున్నారు. మూడు కాలేజీల‌కు రూ.100 కోట్ల ఖ‌ర్చ‌వుతుంద‌ని అధికారులు అంచ‌నాలు వేశారు.

Published date : 21 Mar 2023 12:36PM

Photo Stories