Skip to main content

‘గురుకుల’ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్‌ పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌వీ రవిసాగర్‌ సూచించారు.

బుధవారం స్థానిక సమగ్రశిక్ష సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చేనెల 25న ప్రవేశ పరీక్ష జరుగుతుందని, ఈనెల 24 వరకు దరఖాస్తులకు గడువు ఉందన్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో సమర్పించాలని, ప్రవేశ పరీక్షలు ఏలూరు, భీమవరం కేంద్రాల్లో నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం ఆయన గురుకుల పాఠశాలలు, కళాశాలల ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎంఈఓ సబ్బితి నరసింహమూర్తి, గురుకుల పాఠశాలల ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Published date : 21 Apr 2023 01:44PM

Photo Stories