Skip to main content

UPSC 2021 Topper Interview : వీరి స‌హాయంతోనే సివిల్స్ ర్యాంక్ కొట్టాను..

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో ఉంటున్న కానిస్టేబుల్ రాంగోపాల్, మల్లేశ్వరి దంపతుల చిన్న కొడుకు విద్యామరి శ్రీధర్ 336 ర్యాంకు పొందారు. రాంగోపాల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తుండగా.... తల్లి మాములు గృహిణి. శ్రీధర్ పదో తరగతి వరకు కరీంనగర్‌లోని వింధ్యవాలి పాఠశాలలో తర్వాత ఇంటర్ నారాయణ కళాశాలలో చదివారు. హైదరాబాద్‌లో మాతృశ్రీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రెండేళ్ల పాటు చెన్నైలో పనిచేసి 2015 నుంచి సివిల్స్ లక్ష్యంగా చదివారు. ఇప్పటివరకు ఆరు సార్లు అటెంప్ట్‌ చేసి చివరగా 336 వ ర్యాంక్ సాధించారు.

Photo Stories